AMARAVATHI

అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపార కేంద్రంగా బోర్స్ సముదాయం-ప్రధాని మోదీ

అమరావతి: అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి సూరత్ లోని డైమండ్ బోర్స్ కార్యాలయం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోందని,,ఈ భవనంలో 175 దేశాల నుంచి 4 వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనుండడం అభినందనీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..ఆదివారం బోర్స్ కేంద్రంను ప్రారంభించిన సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ ఎగుమతులు-దిగుమతులు, కస్టమ్స్ క్లియరెన్స్, రిటైల్ జువెలరీ, డైమండ్ రీసెర్చ్ సెంటర్ లాంటి అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయన్నారు.. ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్ బోర్స్ కేంద్రం ద్వారా 1.50 లక్షల మందికి ఉపాధి లభించబోతోందని,, డైమండ్ బోర్స్ సెంటర్ తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపు వస్తుందన్నారు..గత 80 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటగాన్ ను,, సూరత్ డైమండ్ బోర్స్ అధిగమించిందన్నారు..
సూరత్ డైమండ్ బోర్స్ కార్యాలయం అత్యంత ఆధునిక నిర్మాణ శైలీతో 36 ఎకరాల విస్తీర్ణంలో 45 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు..ఒకేసారి 67 వేల మంది సౌకర్యవంతంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే విధంగా భవన నిర్మాణం జరిగింది.. 4500 పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవన సముదాయంలో 131 హైస్పీడ్ లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు..అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనంగా ఈ నిర్మాణం చరిత్ర సృష్టించింది.. ప్రస్తుతం సూరత్ నుంచి ఏటా రూ. 2 లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపార కార్యకాలపాలు జరుగుతుండగా,,రాబోయే రోజుల్లో రూ.4 లక్షల కోట్లకు పెరుగుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

10 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

12 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

16 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

16 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

20 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.