అమరావతి: భారతదేశ అవసరాల కోసం ఇంధనాన్ని ఎక్కడి నుంచైనా కొనుగోలు చేస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అమెరికా ఇంధనశాఖ కార్యదర్శి జెన్నిఫర్ గ్రాన్హోమ్తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ భారత్ తమ పౌరులకు ఇంధనాన్ని అందించడం నైతిక బాధ్యతని, అందుకు ఏ దేశం నుంచైనా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగొలు చేయవద్దని ఏ దేశం తమకు చెప్పలేదన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించిందని,, దేశంలో ఉన్న జనాభా, వినియోగం దృష్ట్యా ఇంధనం కొనుగోలు చేస్తామని హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఇంధనం ఖరీదుతో పాటు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇంధనం కొనుగోలు ఉంటుందని,దేశ ప్రయోజనాలకు సంబంధించిన విధానల పట్ల స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు,వ్యాపారులపై పడిందని, ఇది అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసిందన్నారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు ఏప్రిల్ నుంచి 50 రెట్లు పెరిగాయని,ఇది భారత్ విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురులో 10 శాతం ఉందని తెలిపారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ముందు రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురు కేవలం 0.2 శాతం మాత్రమే అని వెల్లడించారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.