DISTRICTS

నెల్లూరు జిల్లా విద్యాధికులకు పుట్టినిల్లి-జాయింట్ కలెక్టర్

మహర్షి వాల్మీకి జయంతి..

నెల్లూరు: భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్(జె.సి) కూర్మనాథ్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంలో జె.సి మాట్లాడుతూ మనిషి తలచుకుంటే ఎటువంటి పరివర్తన చెందవచ్చునో వాల్మీకి మహర్షి జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చన్నారు. కార్పొరేట్ సంస్కృతి లో కొట్టుమిట్టాడుతున్న నేటి భారతీయతను పరిరక్షించడానికి రామాయణ మహాకావ్యంలో తెలిపిన విధంగా నేటి సమాజం ఆచరించవలసిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎలాంటి కష్టం ఎదురైనా నెరవేర్చవలసిన బాధ్యత ఉందని, ధర్మాన్ని పరిరక్షించడానికి అందరూ పాటుపడాలన్నారు. సమాజంలో ఎదుటివారితో ఎలా మెలగాలో తెలియజేసే అపురూప మహా కావ్యం రామాయణమని, రామాయణ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించటానికి ప్రయత్నించాలన్నారు. రామ అనే పదంలోనే అనేక అర్థాలు గోచరిస్తాయని తెలిపిన వక్తల అభిప్రాయంతో ఏకీభవిస్తూ నెల్లూరు జిల్లా విద్యాధికులకు పుట్టినిల్లని, అందరం కలసి జిల్లా అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత మహర్షి వాల్మీకి చిత్రపటానికి జాయింట్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగీత కళాశాల ఆధ్వర్యంలో కళా దీప్తి డాన్స్ అకాడమీ విద్యార్థినులు శుద్ధ బ్రహ్మ పరాక్రమ రామా అంటూ చేసిన నృత్య రూపకం ఆహుతులను ఆకట్టుకుంది.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

5 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

5 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.