INTERNATIONAL

“భారత ఆర్థికవ్యవస్థ” బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది-IMF నివేదిక

అమరావతి: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు,వృద్ధిరేటు పడిపోవడంతో చాలా వరకు క్షిణించాయి.భారత్ లో కూడా లాక్ డౌన్ కారణంగా వివిధ రంగాలు భారీ నష్టాన్నే చవిచూశాయి..అయితే కోవిడ్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలోపడుతోంది. ముఖ్యంగా ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా కోవిడ్ కారణంగా క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను సాధిస్తున్నాయి.. తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్-IMF నివేదిక ప్రకారం “భారత ఆర్థికవ్యవస్థ” బ్రిటన్ కంటే మెరుగ్గా ఉన్నట్లు పేర్కొంది..ప్రపంచ దేశాలతో పోటీపడుతూ.. పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలకు ధీటుగా నిలుస్తూ గట్టిపోటీనిస్తోంది. అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్, చైనా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రమంగా క్షిణిస్తుండగా,, భారత ఆర్థిక వ్యవస్థమాత్రం నిదానం పైకి ఎగబాకుతొంది..భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈఏడాది 7% నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది.బ్రిటన్ కంటే భారత్ మెరుగైన స్థానానికి చేరుకుని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది.. ఇప్పటివరకు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆస్థానాన్ని కోల్పోయి 6వ స్థానంలో కొనసాగుతోంది.IMF గణాంకాలు ప్రకారం 2021 డిసెంబర్ నాటికే భారత ఆర్థిక వ్యవస్థ ఈస్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ఎదిగి 85,407 కోట్ల డాలర్లకు చేరుకుంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 81,600 కోట్ల డాలర్లతో, భారత్ తరువాతి స్థానంలో ఉంది. అమెరికా, యూరప్, చైనా, జపాన్ వంటి దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. భారత్ మాత్రం తన వృద్ధిరేటును మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎదగడం దేశ ఆర్థిక రంగంలో శుభసూచికంగా భావించవచ్చు.

Spread the love
venkat seelam

Recent Posts

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

1 hour ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

1 hour ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

20 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

This website uses cookies.