DISTRICTS

సరోగసి కేంద్రాలో తనిఖీలు నిర్వహించాలి-కలెక్టర్ హరినారాయణన్

నెల్లూరు: జిల్లాలో నూతనంగా ఏర్పాటయ్యే ART, సరోగసి కేంద్రాలను సభ్యులందరూ సమిష్టిగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ ఆదేశించారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అధ్యక్షతన జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PC,,PNDT,ART, సరోగసి చట్టాలను జిల్లాలో సక్రమంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో లింగ నిష్పత్తి ప్రతి వేయి మంది పురుషులకు 914 మంది స్త్రీలు ఉన్నందున, ఆకస్మిక తనిఖీలు చేసి లింగ నిర్ధారణకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే ART, సరోగసి కేంద్రాలను సభ్యులందరూ సమిష్టిగా తనిఖీలు నిర్వహించి సవివరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు..కమిటీ సభ్యులైన జిల్లా మొదటి అదనపు జడ్జి జి.కబర్థి మాట్లాడుతూ స్కానింగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న ART క్లినిక్స్, సరోగసి క్లినిక్స్, స్కానింగ్ సెంటర్లు తదితర కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ ఆమోదం కొరకు ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి వెంకట ప్రసాద్ అందించారు.ఈ సమావేశంలో సభ్యులు Dr గీతా లక్ష్మి,NGO కవితా రెడ్డి, లీగల్ కన్సల్టెంట్ రూప, DSP శివాజీ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

10 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

11 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.