NATIONAL

ఎన్నో ఆడ్డంకులను దాటుకుంటూ భారత్‌ అజాద్ కీ అమృతోత్సవ కాలంకు చేరుకుంది-ప్రధాని మోదీ

అమరావతి: లక్షల మంది త్యాగధనుల పోరాటంతో సాధించుకున్న స్వాతంత్ర్యం,,అనంతర కాలంలో దేశ ప్రజలు స్వేఛ్చవాయువులతో అభివృద్ది దిశగా నడక ప్రారంభించారని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..అదివారం మధ్యాహ్నం నూతన లోకసభ ప్రాంగణంలో సభ్యులను,దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.. ఎన్నో ఆడ్డంకులను దాటుకుంటూ భారత్‌ అజాద్ కీ అమృతోత్సవ కాలంకు చేరుకుందన్నారు.. అమృతోత్సవ వేళ దేశం మరింత పురోభివృద్ధి దిశగా పయనించాలని అక్షాంక్షించారు.. అమృతోత్సవ కాలం దేశానికి కొత్త మార్గాన్ని సూచిస్తుందని,,ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను సాకారం చేసుకోవాలన్నారు..ముక్త భారత్‌ కోసం నవీన పంథా కావాలని,,నూతన పార్లమెంట్ ప్రాగంణంలొ తీసుకునే నిర్ణయలు భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తాయన్నారు..ప్రపంచ యవనికలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు..21వ శతాబ్దపు నూతన భారతదేశం ఉన్నత స్ఫూర్తితో బానిసత్వ ఆలోచనను వదిలివేస్తోందన్నారు..పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు..

ప్రతి భారతీయుడు గర్వపడేలా నిర్మాణం:- ఈరోజు కొత్త పార్లమెంటు భవనాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వంతో  పొంగిపోతారన్నారు..ఇందులో వాస్తుశిల్పం, వారసత్వం, కళ, నైపుణ్యం, సంస్కృతి, రాజ్యాంగం కూడా ఉన్నాయన్నారు.. లోక్‌సభ లోపలి భాగం జాతీయ పక్షి నెమలిపై, రాజ్యసభ లోపలి భాగం జాతీయ పుష్ప కమలంపై నమూనలో ఉంటుందని,,.పార్లమెంట్ ఆవరణలో జాతీయ వృక్షం మర్రి చెట్టు కూడా ఉందన్నారు..

బానిసత్వ ఆలోచనను వదిలి:- 21వ శతాబ్దంలో భారత్‌ ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశం బానిస వాసనలను వదిలిపెట్టి ముందుకెళ్తోంది. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు ప్రధాని మోదీ.

లోక్‌సభలో పవిత్ర సెంగోల్‌:- కొత్త పార్లమెంటు లోక్‌సభలో పవిత్ర సెంగోల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పవిత్ర సెంగోల్ కు గౌరవం తిరిగి లభించిందన్నారు..సాధువుల ఆశీస్సులతోనే మనం పవిత్ర సెంగోల్‌కు దాని గౌరవాన్ని తిరిగి ఇవ్వగలిగామని ప్రధాని మోదీ అన్నారు.. ప్రజాస్వామ్యం మనకు ఒక ఆలోచన, ఒక సంప్రదాయం, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి, పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అన్నా ప్రధాని మోదీ..ఎక్కడైనా ఆగిపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుందని,,స్వాతంత్య్రం అనంతరం ప్రారంభించిన నడక అగిపోకుండా ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలన్నారు..

విడుదలైన రూ.75 నాణెం:- కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం రూ. 75 నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు.. అలాగే కొత్త తపాలా స్టాంపును ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సహా ఇతర నేతలు విడుదల చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

5 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

8 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

9 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.