AMARAVATHI

మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్, మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 1వ నుంచి 20వ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. 81 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలకు 52076 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. వీరిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 25202 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 24243, ఒకేషనల్ విద్యార్థులు 2631 మంది ఉన్నారు. 4 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే మార్చి 18వ తేదీ నుంచి 30 తేదీ వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల మధ్య 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 176 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు  మొత్తం 32834 మంది విద్యార్ధులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష సమయానికి నిర్ణీత సమయాన్ని కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా అవగాహన కల్పించాలన్నారు.పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని,పరీక్షా కేంద్రాల సమీపంలో ఎక్కడా కూడా జిరాక్స్ కేంద్రాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు ఎటువంటి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో గుర్తింపు పొందిన అధికారులు, సిబ్బంది మాత్రమే ఉండాలన్నారు. ఇతర వ్యక్తులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. RTC అధికారులు విద్యార్థులకు సౌకర్యవంతంగా పరీక్షలకు ఒక గంట ముందుగానే వెళ్ళే విధంగా వివిధ గ్రామాల నుంచి బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

24 mins ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

15 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

15 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

22 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.