నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా సాధారణ డిగ్రీ కోర్సులలో ప్రవేశపెట్టిన ఇంటర్న్షిప్ విధానాన్ని అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి పునాది వేసుకోవాల్సిందిగా విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టర్ చక్రధర్ బాబు సూచించారు. సోమవారం నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో LIC సంస్థలో ఇంటర్నషిప్ చేయబోవు విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేనివిధంగా, కేవలం ప్రొఫెషనల్ కోర్సులలో మాత్రమే ఉండే ఇంటర్న్షిప్ విధానాన్ని సాధారణ డిగ్రీ కోర్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. పరిశ్రమల భవిష్యత్తు అవసరాలను ముందుగానే గుర్తించి విద్యార్థులకు ఆయా రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థినీ విద్యార్థులు సానుకూల దృక్పథం కలిగి ఉండి, ఇంటర్న్షిప్ ను కేవలం కోర్సులో భాగంగా కాకుండా, జీవితంలో ఉపయోగపడేవిధంగా నేర్చుకోవడానికి కృషి చేయాలన్నారు. ఇన్సూరెన్స్ రంగంలో తమదైన మార్కెటింగ్ వ్యూహలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన సంస్థ భారత జీవిత భీమా సంస్థయని అటువంటి సంస్థ లో దాదాపు 800 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించిన భారత జీవిత భీమా సంస్థ వారికి, సహాయ సహకారం అందించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వారికి తమ ప్రత్యేక ధన్యవాదాలన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.