AMARAVATHI

2024లో జనసేన-టీడీపీ కలసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖయం-పవన్

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు..

అమరావతి: 2024లో జనసేన-టీడీపీ కలసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖయం అని అన్నారు.. వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది ముఖ్యనేతలు జనసేన పార్టీలో చేరారు.. పార్టీలో చేరినవారికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నేను ఏదైనా మాటల్లో చెప్పను,, నిలబడి చేసి చూపిస్తానని అన్నారు.. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డామని, కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చామన్నారు.. ఒక కులాన్ని ఆధారం చేసుకుని రాజకీయాలు నడపలేమన్నారు.. సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టమని,, రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది తన ఉద్దేశమన్నారు.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా,, వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తు చేశారు..తాను ఇగోలకు వెళ్లలని, ఛాన్సులు తీసుకోదలచుకోలేదని,, ఏపీ ప్రజలు గెలవాలనుకుంటున్నానని అన్నారు…జనసేనలో చేరిన వారిలో చిలకలపూడి పాపారావు ( సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు – కృష్ణాజిల్లా), చిక్కాల దొరబాబు (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), పొగిరి సురేష్ బాబు (శ్రీకాకుళం జిల్లా వైసిపి నాయకులు),కలగ పాల్ పురుషోత్తం (తూర్పుగోదావరి వైసిపి నాయకులు),ఎదురువాక శ్రీ వెంకటగిరి (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), దుగ్గన నాగరాజ (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), వై. శ్రీనివాస్ రాజు (కడప జిల్లా వైసిపి నాయకులు) ఉన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

17 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

21 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

2 days ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 days ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

2 days ago

This website uses cookies.