నూతన కార్య నిర్వాహకుల నియామకం..
హైదరాబాద్: వచ్చే సంవత్సరం తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ వ్యూహాలు సిద్దం చెస్తొంది. ఇందులో భాగంగా 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం జరిగిందని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు వివరించింది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి అధికంగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మొదటి దశలో 32 మందిని కార్యనిర్వాహకులుగా నియమించినట్లు తెలిపారు. వారి పేర్లను జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ కల్యాణ్, అటు తెలంగాణలో,ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి ‘వారాహి’ పేరుతో వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.