నెల్లూరు: బోగోలు మండల పరిధిలోని రూ.300 కోట్లతో చేపట్టిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 95 శాతం మేర పూర్తయ్యాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.సోమవారం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులనుమంత్రి కాకాణి, కావలి ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రికార్డు సమయంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను చేపట్టామని,మరో 5 శాతం పనులు మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని, ఈ పనులను కూడా త్వరలో పూర్తిచేసి ముఖ్యమంత్రి చే ప్రారంభోత్సవం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈ హార్బర్ ఏర్పాటుతో సుమారు ఆరువేల మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అన్ని విధాల ఈ ప్రాంత రూపు రేఖలు పూర్తిగా మారి పోతాయన్నారు. చెప్పారు.కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బకింగ్ హామ్ కెనాల్ మరమ్మత్తులు, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి తమ దృష్టికి తీసుకొచ్చారని, వీటిని పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించినట్లు మంత్రి చెప్పారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, కావలి ఆర్డిఓ శీనా నాయక్, ఏపీ మారిటైం బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.