అమరావతి: తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి, భారీ విజయం సాధించిన కాంతార సినిమా ప్రస్తుతం కాపీరైట్స్ సమస్యను ఎదుర్కొంటుంది.ఈ రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన కాంతారం మొదట కన్నడలో విడుదల అయ్యి అక్కడ హిట్ కొట్టక ఆటు తరువాత హిందీ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది.20 కోట్లతో తీసిన ఈ సినిమాకి ఇప్పటివరకు దాదాపు 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ప్రేక్షకులతో పాటు సినిమా తారలు సైతం ఈ సినిమాని అభినందిస్తున్నారు.అయితే, ఈ సినిమాలో వాడిన మ్యూజిక్ మేం కాంపొజ్ చేసిందే,, లీగల్ నోటీసులు పంపిస్తాం అంటూ ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నడలో ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. గతంలో వీరు నవరసం పేరుతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ మ్యూజిక్ కాంతార సినిమాలోని బాగా పాపులర్ అయిన వరాహ రూపం మ్యూజిక్ ఒకేలా ఉందని తైక్కుడం బ్రిడ్జ్ టీం ఆరోపిస్తున్నారు.
తైక్కుడం బ్రిడ్జ్ టీం తమ సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ..”మా ఆడియన్స్ కి మేము ఒకటే చెప్తున్నాము.కాంతార సినిమాకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మా సాంగ్ నవరసం, కాంతార లోని వరాహ రూపం సాంగ్ లో ఉన్న మ్యూజిక్ చాలా వరకు ఒకటే. ఇది పూర్తిగా కాపీ రైట్ చట్టాలని ఉల్లంఘించడమే అవుతుంది. కాపీ చేయడం,, ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది.ఆ మ్యూజిక్ పూర్తిగా మా సొంతం. అందుకే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. చిత్ర యూనిట్ కి లీగల్ నోటీసులు పంపిస్తున్నాం” అని తెలిపారు. అలాగే చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా ఈ పోస్ట్ ని ట్యాగ్ చేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ స్పందించలేదు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.