SPORTS

రాష్ట్రస్థాయి క్రీడా ఉత్సవాలు-మంత్రి కాకాణి

పోస్టర్ విడుదల..

నెల్లూరు:  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జగనన్న క్రీడా సంబరాల్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని తమ సత్తా చాటి జిల్లాకు మంచిపేరు తీకునిరావాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జగనన్న క్రీడా సంబరాలకు సంబంధించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా మెగా టోర్నమెంట్ నిర్వహించి ముఖ్యమంత్రి పుట్టినరోజు డిసెంబర్ 21న ఫైనల్స్ నిర్వహించి విజేతలకు సుమారు 50 లక్షల వరకు నగదు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. జిల్లాలోని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు), మెన్స్ క్రికెట్ క్రీడల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.

అనంతరం సెట్నల్ సీఈవో పుల్లయ్య జగనన్న క్రీడా సంబరాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నియోజకవర్గ, జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయిలో కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు), మెన్స్ క్రికెట్ పోటీలకు సంబంధించి క్రీడాకారులు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సెట్నల్ సీఈవో పుల్లయ్య చెప్పారు. నవంబర్ 10 లోగా నియోజకవర్గ స్థాయిలో, 30లోగా జిల్లా, డిసెంబర్ 10లోగా జోనల్ స్థాయిలో ఆటల పోటీలను నిర్వహించి డిసెంబర్ 21న ఫైనల్స్ నిర్వహించేలా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన చెప్పారు.ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు వయసు 17 ఏళ్ళకు పైబడి ఉండాలన్నారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు చెప్పారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

59 mins ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

1 hour ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

2 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

22 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

23 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

1 day ago

This website uses cookies.