INTERNATIONAL

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ను అధికారికంగా ప్రకటించిన రాజు చార్లెస్ 3

అమరావతి: భారత సంతతికి చెందిన రిషి సునాక్(42)ను బ్రిటన్ ప్రధానిగా,రాజు చార్లెస్ 3 అధికారికంగా బ్రిటన్ ప్రధానిగా ప్రకటించారు. రిషికి ప్రధాని బాధ్యతలు అప్పగించిన విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కింగ్ చార్లెస్ 3 నుంచి వచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు రిషి వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సరికొత్త చరిత్రను లిఖించారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడమే తన మొదటి లక్ష్యమని వెల్లడించారు.‘‘ బ్రిటన్ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తా. వారి శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమించి పనిచేస్తా. భవిష్యత్ తరాలు రుణ ఊబిలో ఉండకుండా చేస్తాను’’ అని ఆయన తెలిపారు. మాటలతో కాకుండా చేతల ద్వారా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తానన్నారు. లిజ్ ట్రస్ గతంలో ప్రధానిగా చేసిన తప్పులను సరిదిద్దుతానని రిషి తెలిపారు. లిజ్ తనదైన శైలిలో దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి తాపత్రయపడిందే తప్ప, మరో ఉద్దేశం ఆమెకు లేదని స్పష్టం చేశారు. అయితే ఆమె చేసిన కొన్ని తప్పులను సరిదిద్దేందుకే కన్జర్వేటివ్ పార్టీ తనకు ప్రధానిగా అవకాశం ఇచ్చిందన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

11 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

14 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

15 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

15 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.