DISTRICTS

రామాయపట్నం ఓడరేవు భూసేకరణ ఈ నెల 20 నాటికి పూర్తి కావాలి-కలెక్టర్

నెల్లూరు: రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పునరావాస ప్రక్రియ ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ కూర్మానాధ్ తో కలిసి రామాయపట్నం ఓడరేవు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ- పునరావాసం తదితర అంశాలపై సంబంధిత రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా గుడ్లూరు తాసిల్దారు శ్రీమతి లావణ్య మాట్లాడుతూ రామాయపట్నం ఓడరేవు నిర్మాణం కోసం మొత్తం 850 ఎకరాల స్థలం అవసరం ఉందని, ఇందుకోసం 180 ఎకరాల పట్టా భూమిని సేకరించి బాధితులకు నష్ట పరిహారం ఇప్పటికే చెల్లించామని కలెక్టర్ కు వివరించారు. ఆ భూమిని ఓడరేవు అధికారులకు అప్పగించామన్నారు. అలాగే 150 ఎకరాల ప్రభుత్వ భూమిని, 65 ఎకరాల అసైన్మెంట్ భూములను కూడా ఓడరేవు అధికారులకు అప్పగించామన్నారు. మరో 100 ఎకరాల చుక్కల భూములకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశామని, 70 ఎకరాలలో టైటిల్ వివాదాలు ఉన్నాయని, మిగిలిన భూసేకరణ ప్రక్రియ వివిధ దశలో నడుస్తోందని తాసిల్దారు కలెక్టర్ కు వివరించారు..అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇక ఏమాత్రం భూసేకరణ ప్రక్రియ ఆలస్యం జరగరాదని వెంటనే పనులు వేగవంతం చేసి, ఈనెల 20వ తేదీ నాటికి భూసేకరణ ప్రక్రియ అంతా పూర్తి కావాలని స్పష్టం చేశారు.ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్ధారించేందుకు కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. భూములు కోల్పోతున్న రావులపాలెం, మొండివారి పాలెం, కర్లపాలెం గ్రామస్తులకు పునరావాసం కోసం అవసరమైన లేఅవుట్ను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతివారం భూసేకరణ నివేదికను అందజేయాలన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

3 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

3 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

5 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

6 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

6 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

7 hours ago

This website uses cookies.