AMARAVATHI

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులేవు-సీ.ఎం రాజీనామ చేయాలి-జీవీఎల్

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పయని బీజెపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు..రాష్ట్రంలో ఇటీవల జరుగుతోన్న పలు నేరాల తీవ్రతపై అయన స్పందిస్తూ ఆదివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు..కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై పూర్తి రిపోర్ట్ ఉందని తెలిపారు..విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారంపై స్పందిచిన జీవీఎల్ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు..విశాఖపట్నంలో భూ మాఫియా చేలరేగిపోతుందని ఆరోపించారు..విశాఖ భూ కుంభకోణంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదంటూ ప్రశ్నించారు..సదరు రిపోర్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి భూ సెటిల్మెంట్ లు చేస్తున్నారని అనుమానులు వస్తున్నయని ఆరోపించారు..బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషం అని,,వైసీపీ కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం పెరిగిపొతుందని మండిపడ్డారు..వైసీపీ అంటే రాక్షస సంత అని వారు ప్రకటించుకుంటే,ప్రజలు తగు జాగ్రత్తల్లో వుంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు..ఆంధ్రప్రదేశ్ లో ఇసుకు, మైనింగ్ పై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన అయన,,ప్రతిపక్షపార్టీలపై రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని నిశితంగా విమర్శించారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

8 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

11 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

14 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

15 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

18 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.