అమరావతి: భారతీదేశ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు M.S.స్వామినాథన్(98) గురువారం కన్నుమూశారు..స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో నేటి ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు..1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ జన్మించారు..భారతీయ వ్యవసాయ రంగంలో అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన అభివృద్ది చేశారు..వ్యవసాయంలో తక్కువ ఆదాయంతో నెట్టుకొస్తున్న రైతులను దృష్టిలో వుంచుకుని,భారతదేశ వాతావరణంకు అనుగుణంగా దిగుబడిని పెంచే అనేక పద్ధతులను ఆయన రైతులకు నేర్పించారు..1971లో ఆయన రామన్ మెగస్సేసే అవార్డును సొంతం చేసుకున్నారు..1986లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు,1987లో స్వామినాథన్ ను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు వరించింది..ఆటు తరువాత ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు..స్వామినాథన్ కు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు వున్నారు..వీరిలో సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.