AGRICULTUREAMARAVATHI

భారతీదేశ హరిత విప్లవానికి జాతిపిత, M.S.స్వామినాథన్ కన్నమూత

అమరావతి: భారతీదేశ హరిత విప్లవానికి జాతిపితగా కీర్తించబడే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు M.S.స్వామినాథన్(98) గురువారం కన్నుమూశారు..స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో నేటి ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు..1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ జన్మించారు..భారతీయ వ్యవసాయ రంగంలో అత్యధిక స్థాయిలో దిగుబడిని ఇచ్చే అనేక వరి వంగడాలను ఆయన అభివృద్ది చేశారు..వ్యవసాయంలో తక్కువ ఆదాయంతో నెట్టుకొస్తున్న రైతులను దృష్టిలో వుంచుకుని,భారతదేశ వాతావరణంకు అనుగుణంగా దిగుబడిని పెంచే అనేక పద్ధతులను ఆయన రైతులకు నేర్పించారు..1971లో ఆయన రామన్ మెగస్సేసే అవార్డును సొంతం చేసుకున్నారు..1986లో ఆల్బర్ట్ ఐన్ స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు,1987లో స్వామినాథన్ ను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు వరించింది..ఆటు తరువాత ఆయన చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు..స్వామినాథన్ కు భార్య మీనాతో పాటు ముగ్గురు కుమార్తెలు వున్నారు..వీరిలో సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *