AMARAVATHI

రైల్వే ప్రయాణికుల కోసం రూ.20, రూ.50 ధరలకే భోజనం

పలు రైళ్లు పొడిగింపు..
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికుల సౌకర్యార్దం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది..వేసవి కాలంలో రద్దీని దృష్టిలో వుంచుకుని ప్రవేశ పెట్టిన పలు రైళ్లు ఆగష్టు 1 నుంచి అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో తెలిపింది..పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా వున్నాయి..
హైదరాబాద్-కటక్-ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు,,కటక్-హైదరాబాద్-ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు,, తిరుపతి-జల్నా-ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు,,జల్నా-తిరుపతి-ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు,, జల్నా-చాప్రా-ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు,,చాప్రా-జల్నా-ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు,, హైదరాబాద్-గోరఖ్ పూర్-ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు,,గోరఖ్ పూర్-హైదరాబాద్-ఆగస్టు 6వ తేదీ నుంచి అక్టోబర్ 1, 2023 వరకు సేవాలు అందిస్తాయి..
రూ.20, రూ.50 ధరలకే భోజన సదుపాయం:-దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలో ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే నాణ్యమైన భోజనం, మంచినీటిని అందించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది..‘ఎకానమీ మీల్స్’ కార్యక్రమంలో భాగంగా,,, మొదటి రకం ఎకానమీ భోజనం రూ.20కు,, రెండో రకం కాంబో భోజనం రూ.50కు అందిచనుంది..ఎకానమీ భోజనంలో 7 పూరీలు, ఆలు కూర, పచ్చడిని అందిస్తారు. కాంబో భోజనంలో అన్నం, కిచిడీ, ఛోలే కుల్చే, ఛోలే భటూరే, పావ్ భాజీ, మసాలా దోశలను ఇస్తారు..భోజనంతో పాటు 200 ఎంఎల్ ప్యాకేజ్ డ్ మంచినీటి వాటర్ గ్లాసులను కూడా అంచేస్తారు..రైల్వే స్టేషన్లలో ఉన్న ఐఆర్ సీటీసీ కిచెన్ యూనిట్లు-జన్ ఆహార్ సర్వీస్ కౌంటర్ల ద్వారా భోజనాన్ని అందించేందుకు జనరల్ కోచ్ ల సమీపంలోని ప్లాట్ఫాంపై ఫుడ్ సర్వీస్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు..అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎకానమీ మీల్ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు..6 నెలల పాటు నాలుగు రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తామని,, అనంతరం ఇతర స్టేషన్లకు విస్తారిస్తామని పేర్కొన్నారు.వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

8 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

22 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

22 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.