AMARAVATHI

చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణ పనులు వేగవంతం చేయండి-కమిషనర్ వికాస్

నెల్లూరు: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల పార్కులో జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి స్థానిక చిల్డ్రన్స్ పార్కులో జరుగుతున్న పనులను కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని చిన్న పిల్లల ఆటవిడుపు వస్తువులు, వివిధ రకాల ప్లే గ్రౌండ్స్, పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలు, వాకింగ్ ట్రాక్, వ్యాయమ ఉపకరణాలు, స్విమ్మింగ్ పూల్, మంచి నీటి సౌకర్యాలు, బెంచ్ ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, సెక్యూరిటీ విభాగం, తినుబండారాల షాపులు తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. పార్కులోని సందర్శకులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి అవసరమైన సదుపాయాల గురించి విచారించారు. ప్రజలు పార్కును ప్రతిరోజూ సందర్శించి ఆటవిడుపు పొందేలా అన్ని వసతులను కల్పించనున్నామని, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి పార్కును త్వరలో సందర్శకులకు అందుబాటులో తెనున్నామని కమిషనర్ వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

7 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

1 day ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

1 day ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

1 day ago

This website uses cookies.