నెల్లూరు: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల పార్కులో జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి స్థానిక చిల్డ్రన్స్ పార్కులో జరుగుతున్న పనులను కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని చిన్న పిల్లల ఆటవిడుపు వస్తువులు, వివిధ రకాల ప్లే గ్రౌండ్స్, పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలు, వాకింగ్ ట్రాక్, వ్యాయమ ఉపకరణాలు, స్విమ్మింగ్ పూల్, మంచి నీటి సౌకర్యాలు, బెంచ్ ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, సెక్యూరిటీ విభాగం, తినుబండారాల షాపులు తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. పార్కులోని సందర్శకులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి అవసరమైన సదుపాయాల గురించి విచారించారు. ప్రజలు పార్కును ప్రతిరోజూ సందర్శించి ఆటవిడుపు పొందేలా అన్ని వసతులను కల్పించనున్నామని, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి పార్కును త్వరలో సందర్శకులకు అందుబాటులో తెనున్నామని కమిషనర్ వెల్లడించారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.