AGRICULTURE

రైతుల కోసం లక్ష కోట్లతో గోదాముల్లో ధాన్యం నిల్వ సామర్ధ్యం పెంపు-మంత్రి అనురాగ్ ఠాకూర్

అమరావతి: దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్గం లక్ష కోట్ల రూపాయలతో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసిందని,,ఈ పథకం కింద ప్రతి మండలంలో రెండు వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్త గోధుమలను నిర్మించనున్నట్లు కేంద్ర సమాచార వెల్లడించారు.. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం వున్న 1,450 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం నుంచి 2,150 లక్షల టన్నులకు పెరగనున్నదని తెలిపారు..రాబోయే 5 సంవత్సరాల్లో మరో 700 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ చేసేందుకు సరిపడా వ్యవస్థ అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు..ఈ పథకం పూర్తి అయితే ప్రపంచంలో అతి పెద్ద ఆహార ధాన్యాల నిల్వ గొదాములు భారత్ లో వుంటాయన్నారు..ఇప్పటి వరకు సరైన నిల్వ సదుపాయం లేక ఆహారధాన్యాలు పాడైపోతున్నాయన్ని,,దినిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు..గోదాముల నిల్వ సామర్ధ్యం పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు..ఇదే సమయంలో రవాణా ఖర్చు తగ్గుతాయని చెప్పారు..భారతదేశంలో ఏటా 3,100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తుందని అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాముల్లో కేవలం 47 శాతం మాత్రమే నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

23 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

24 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

1 day ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.