AMARAVATHI

వెటకారాలు, వ్యంగాలు వద్దు…బాథ్యతతో పని చేయండి-పవన్ కల్యాణ్

అమరావతి: రాబోయే ఎన్నికలలో జనసేన బలమైన శక్తిగా ఎదిగేందుకు జనసైనికులు కృషి చేయాలని,,టీడీపీతో కలిసి వెళుతున్నాం. చిన్న ఇబ్బందులు వచ్చినా,,సర్దుకుని ముందుకు వెళ్లేలా అందరూ పనిచేయాలని పార్టీ నేతలకు అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు..మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన క్రియాశీల సభ్యుల సమావేశంలో వారికి నియామక పత్రాలను పవన్ కళ్యాణ్ అందచేసిన చేశారు..అనంతరం జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన అసెంబ్లీలో ఉండే విధంగా పని చేయాలని కోరారు.. కేవలం జనాదరణతోనే ఇంతవరకు జనసేన నడిచిందని,, 6.30 లక్షల మంది క్రియాశీలక సభ్యులుగా పార్టీ సత్తా చాటుతొందన్నారు..ప్రజల భవిష్యత్ ను బంగారు మయంగా చేసే విధంగా కృషి చేద్దాం అన్నారు..ప్రజల్లో ఉన్న భావనను గమనించి, రిపోర్టులు తెప్పించుకుని,,టీడీపీతో కలిసి వెళుతున్నాం,,వైసీపీ పోవాలి,,జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పడేలా ముందుకు వెళదాం అని అన్నారు..సీఎం స్థానం వద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు,,అయితే దాని కోసం వెంపర్లాడను,,నాకు సీఎంగా అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటాం,, ప్రజల కోసం ఆదర్శపాలన అందిద్దాం అని పవన్ కల్యాణ్ అన్నారు.. “వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ పేరుతో కోట్లు దోచుకుంది.. 3,,5 తరగతి పిల్లలకు టోఫెల్ అంటే అర్దం అవుతుందా…ఇంగ్లీష్ మీడియం పేరుతో ఇన్ని వేలకోట్లు ఖర్చు అవసరమా? బ్రిటీష్ తరహా ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్ప… ఎదగమనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు…అలాగ అయితే అబ్దుల్ కలాం వంటి మహానుభావులు ఏ ఇంగ్లీష్ మాట్లాడతారు…మంత్రి బొత్స కూడా బ్రిటీష్ తరహా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రి అయ్యారా? పిల్లల్లో సృజనాత్మకతను గుర్తించి…క్రియేటీవిటీ నాలెడ్జ్ ను పెంచాలి…ఇంగ్లీష్ నేర్చుకుంటే అద్భుతాలు జరుగుతాయా? అలా అయితే అమెరికాలో పేద వాళ్లే ఉండకూడదు కదా? అంటూ వ్యాఖ్యనించారు..సి.బి.యస్.ఇ విద్యా విధానం కూడా కొన్ని పాఠశాలల్లో తొలగించారు…ప్రభుత్వం అవగాహనంతో చేస్తుందా? స్కాం కోసమే చేస్తుందా? బొత్స కూడా మమ్మలను కించపరిచేలా మాట్లాడటం కాదు…విద్యార్దులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటామా? 2024 ఎన్నికలలో ప్రభుత్వం మారిన వెంటనే,,ఈ స్కాంను వెలుగులోకి తెస్తాం… అరెస్టులు చేస్తాం…బై జ్యూస్ నుంచి ఇప్పటి వరకు జరిగిన వ్యవహారంపై విచారణ చేయిస్తాం…విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న తరువాత ఉల్లంఘన జరిగితే? పరిణామాలు తీవ్రంగా ఉంటాయి…మంత్రి బొత్స స్పందించాలి… దీనిపై స్పష్టత ఇవ్వాలి… మీపై గౌరవం ఉంది…వెటకారాలు, వ్యంగాలు వద్దు…బాథ్యతతో పని చేయండని పవన్ కల్యాణ్ సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

4 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.