AMARAVATHI

విజయదశమికి నాటికి “స్టార్ లైనర్ “ పేరిట non-a/c స్లీపర్ సర్వీసులు-తిరుమలరావు

అమరావతి: విజయదశమి పండగ సందర్భంగా ప్రయాణీకులకు APSRTC శుభవార్త తెలిపింది..ఈ దశరా నాటికి “స్టార్ లైనర్ “ పేరిట non-a/c స్లీపర్ సర్వీస్ ను ప్రారంభిస్తామని APSRTC M.D ద్వారకా.తిరుమలరావు వెల్లడించారు..దసరా పండుగ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని,,ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాధారణ బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఎం.డీ తెలిపారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు అదనంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.. పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టమని,,ఈ సంవత్సరం సరికొత్త పద్దతిలో ప్రయోగాత్మకంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు..ఈ సంవత్సరం తమ సంస్థ చేపట్టిన విధానంలో మంచి ఫలితాలు వస్తే,, ఇదే విధానాన్ని ఇక నుంచి కొనసాగిస్తామని,, లేదంటే పాత విధానం అమలు గురించి మళ్లీ ఆలోచిస్తామన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం,, ప్రయాణికులు ఫిర్యాదులు, సలహాల కోసం 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ప్రయాణికులకు ఏదైన సమస్య వున్నట్లయితే 0866 2570005 నెంబర్ కు ఫోన్ చేసి తెలియచేయవచ్చన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

14 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

15 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

17 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

17 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

18 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.