అమరావతి: భారతదేశంలోని పఠాన్ కోట్ భారత వైమానిక దళ స్థావరంపై 2016లో జరిగిన ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి షాహిద్ లతీఫ్ ను పాకిస్థాన్ లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు.. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలున్న లతీఫ్ ను సియాల్ కోట్ లోని ఒక మసీదు వెలుపల కాల్పులు జరిపిన అగంతకులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు..సమాచారం అందుకుని సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెలుసుకుని విచారణ ప్రారంభించారు..
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కేసులో లతీఫ్ మోస్ట్ వాండెడ్ టెర్రరిస్టుగా NIA ప్రకటించింది.. పాకిస్థాన్ అనూకుల ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ లో సీనియర్ సభ్యుడుగా ఉన్న లతీఫ్ 2016లో పఠాన్ కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడికి ప్రణాళిక రచించాడు..భారీ స్థాయిలో పాక్ ప్రేరిపిత ఉగ్రమూకలు అప్పట్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద దాడికి పాల్పడ్డాయి..లతీఫ్ ఈ మొత్తం కుట్రను సియాల్ కోట్ నుంచే నడిపించాడు..బేస్ క్యాంప్ పై దాడికి కరగుగట్టిన జైషే ఉగ్రవాదులను కూడా పంపాడు..భారతదేశంలో 16 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్ష అనంతరం అతన్ని 2010లో వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ కు తిరిగి పంపారు..2010లో ఆయన విడుదలైన తరువాత తిరిగి జీహాదీలను తయారీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు NIA స్పష్టం చేసింది..భారత ప్రభుత్వ వాటెండ్ టెర్రరిస్టుల జాబితాలో అతని పేరు చేర్చింది..
https://x.com/NikhilCh_/status/1712004089360601579?s=20
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.