AMARAVATHIINTERNATIONAL

పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ పాకిస్థాన్ లో కాల్చివేత

అమరావతి: భారతదేశంలోని పఠాన్ కోట్ భారత వైమానిక దళ స్థావరంపై 2016లో జరిగిన ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి షాహిద్ లతీఫ్ ను పాకిస్థాన్ లో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు.. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలున్న లతీఫ్ ను సియాల్ కోట్ లోని ఒక మసీదు వెలుపల కాల్పులు జరిపిన అగంతకులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు..సమాచారం అందుకుని సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెలుసుకుని విచారణ ప్రారంభించారు..
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కేసులో లతీఫ్ మోస్ట్ వాండెడ్ టెర్రరిస్టుగా NIA ప్రకటించింది.. పాకిస్థాన్ అనూకుల ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ లో సీనియర్ సభ్యుడుగా ఉన్న లతీఫ్ 2016లో పఠాన్ కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడికి ప్రణాళిక రచించాడు..భారీ స్థాయిలో పాక్ ప్రేరిపిత ఉగ్రమూకలు అప్పట్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద దాడికి పాల్పడ్డాయి..లతీఫ్ ఈ మొత్తం కుట్రను సియాల్ కోట్ నుంచే నడిపించాడు..బేస్ క్యాంప్ పై దాడికి కరగుగట్టిన జైషే ఉగ్రవాదులను కూడా పంపాడు..భారతదేశంలో 16 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్ష అనంతరం అతన్ని 2010లో వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ కు తిరిగి పంపారు..2010లో ఆయన విడుదలైన తరువాత తిరిగి జీహాదీలను తయారీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు NIA స్పష్టం చేసింది..భారత ప్రభుత్వ వాటెండ్ టెర్రరిస్టుల జాబితాలో అతని పేరు చేర్చింది..

https://x.com/NikhilCh_/status/1712004089360601579?s=20

 

 

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *