నెల్లూరు: పెద్దపవని గురుకుల కళాశాల విద్యార్థినులకు రెండో విడత కౌన్సిలింగ్లో అవకాశం కల్పించాలని కలెక్టర్ హరి నారాయణన్ ఉన్నత విద్య మండలి అధికారులను కోరారు..జిల్లాలోని కావలి మండలం పెద్ద పవని గురుకుల కళాశాలకు చెందిన 37 మంది విద్యార్థినులకు ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తు చేయడంలో శ్రీకాళహస్తి కి చెందిన ముప్పాళ్ళ రవి తప్పుదోవ పట్టించి ప్రైవేటు కళాశాలలకు దరఖాస్తు చేశాడని విద్యార్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో విద్యార్థులు, కలెక్టర్ కు తమ ఆవేదన తెలియచేశారు. తామంతా మంచిర్యాంకులు సాధించామని తెలిపారు.ఈ విషయమై స్పందించిన కలెక్టర్ ఉన్నత విద్యా మండలి అధికారులతో మాట్లాడారు. రెండవ కౌన్సిలింగ్లో విద్యార్థులకు అవకాశం కల్పించాలని వారిని కోరారు. గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్ హేమలతను సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించిన ముప్పాల రవి పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశించారు.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.