DISTRICTS

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించండి- కమిషనర్ వికాస్

నెల్లూరు: పూర్తిస్ధాయిలో ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. సమీక్ష లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కొన్ని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైనప్పటికీ ప్రస్తుత ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు, ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18  సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదు కావలసినవారు, నివాసం మారినవారు, ఇటీవల మరణించిన వారి సమాచారాన్ని సేకరించి, ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేస్తున్నామని కమిషనర్ తె లిపారు.21 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు ఓటు నమోదు చేయించుకొని వారిని ప్రత్యేకంగా విచారించాలని, 80 సంవత్సరాలు దాటిన ఓటరులను ప్రత్యక్షంగా విచారించాలని, అదేవిధంగా ఒకే ఇంట్లో పదిమందికి పైగా ఓటర్ల సంఖ్య నమోదు అయినట్లయితే అలాంటి వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లు మార్పు చేయవలసి ఉన్న, ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా సమస్యలు ఉన్న ఏ.ఈ.ఆర్.ఓ ల దృష్టికి తీసుకురావాలన్నారు.ఒకే ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఓట్లు వేరు వేరు పోలింగ్ బూత్ లలో కాకుండా, ఒకే పోలింగ్ బూత్ లో ఉండే విధంగా జాబితాలో మార్పు చేర్పులు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

4 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

7 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

8 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

12 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.