స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించండి- కమిషనర్ వికాస్
నెల్లూరు: పూర్తిస్ధాయిలో ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. సమీక్ష లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కొన్ని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైనప్పటికీ ప్రస్తుత ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు, ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదు కావలసినవారు, నివాసం మారినవారు, ఇటీవల మరణించిన వారి సమాచారాన్ని సేకరించి, ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేస్తున్నామని కమిషనర్ తె లిపారు.21 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటివరకు ఓటు నమోదు చేయించుకొని వారిని ప్రత్యేకంగా విచారించాలని, 80 సంవత్సరాలు దాటిన ఓటరులను ప్రత్యక్షంగా విచారించాలని, అదేవిధంగా ఒకే ఇంట్లో పదిమందికి పైగా ఓటర్ల సంఖ్య నమోదు అయినట్లయితే అలాంటి వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లు మార్పు చేయవలసి ఉన్న, ఓటర్ల జాబితా సవరణలో ఏవైనా సమస్యలు ఉన్న ఏ.ఈ.ఆర్.ఓ ల దృష్టికి తీసుకురావాలన్నారు.ఒకే ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఓట్లు వేరు వేరు పోలింగ్ బూత్ లలో కాకుండా, ఒకే పోలింగ్ బూత్ లో ఉండే విధంగా జాబితాలో మార్పు చేర్పులు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.