అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్నకారు ప్రమాదానికి గురైయింది. కర్ణాటకలోని మైసూర్, కడకోలా సమీపంలో మంగళవారం మధ్యహ్నం 1.30 నిమిషాలకు రోడ్డు డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఘటన జరిగిన సమయంలో కారులో ప్రహ్లాద్ మోదీ డ్రైవింగ్ చేస్తుండగా,అయనతో పాటు కొడుకు, కోడలు, మనవడు కూడా ఉన్నారు..వీరు మెర్సిడెస్ బెంజ్ కారులో బెంగళూరు నుంచి బందీపూర్ వెళ్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. ఫలితంగా ప్రహ్లాద్ మోదీకి, ఆయన కోడలు, మనవడికి స్వల్ప గాయలయ్యాయి..విషయం తెలుసుకున్న మైసూర్ ఎస్పీ సీమా లట్కర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని,,చికిత్స కోసం క్షతగాత్రులను వెంటనే మైసూరులోని JSS ఆస్పత్రికి తరలించారు. మైసూరు తాలూకాలోని కడకోలా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.