NATIONAL

ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను  ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రాల కలుపుతూ ఎక్స్ప్రెస్వే నిర్మాణం..

అమరావతి: దేశానికి తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ,ఆదివారం రాజస్థాన్లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి ప్రారంభించారు..ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్ వరకు మొదటి దశగా 246 కిలోమీటర్ల రోడ్డు ప్రారంభమైంది..వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్ప్రెస్వేతో ఢిల్లీ-జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుంది..ఢిల్లీ-దౌసా (జైపూర్ సమీపం) వరకు నిర్మాణం పూర్తి చేస్తున్న ఈ మొదటి దశకు 12,150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు.,

ఎక్స్ ప్రెస్ వే ప్రత్యేకతలు:-ముంబై-ఢిల్లీ ఎక్స్ప్రెస్వే మొత్తం పొడవు 1,386 కిలో మీటర్లు..ఢిల్లీలోని డీఎన్డీ ఫ్లైఓవర్ నుంచి ముంబైలోని జేఎన్పీటీ వరకు వుంటుంది..8 లైన్స్ తో నిర్మితమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్వే..ఈ ఎక్స్ప్రెస్వే నిర్మాణం పూర్తి కావలంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుదన్న అంచనా వుంది..ఎక్స్ప్రెస్వే పూర్తి అయితే ఢిల్లీ-ముంబై మధ్య ప్రయాణ సమయం సగం తగ్గుతుంది.. ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న ప్రయాణం, 12 గంటలకు తగ్గుతుంది..ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర (6 రాష్ట్రాలు) రాష్ట్రాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం వేగంగా సాగుతొంది..ఎక్స్ప్రెస్వే 93 PM గతిశక్తి ఎకనామిక్ నోడ్స్,,13 పోర్టులు,, 8 మేజర్ ఎయిర్పోర్టులు,, 8 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను కలుపుతుంది..వన్యప్రాణుల సంరక్షణ కోసం ఓవర్ పాస్,, అండర్ పాసులు నిర్మించిన ఆసియాలోని తొలి ఎక్స్ప్రెస్వే.. శిక్షణ పొందిన 4,000 మంది ఇంజనీర్లు 24X7 పని చేస్తున్నారు..ఎక్స్ప్రెస్వే వల్ల సంవత్సరానికి 300 మిలియన్ లీటర్ల ఇంధనం ఆదా,, కాగా 800 మిలియన్ కిలోగ్రామ్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి..ఎక్స్ప్రెస్వేను ఇంజనీరింగ్ మార్వెల్ అని నిలిచిపోతుంది..భవిష్యత్ లో విద్యుత్ వాహనాల రాకపోకలకు అనుగుణంగా దీన్ని తీర్చి దిద్దుతున్నారు..విద్యుత్ వాహనాల కోసం ప్రత్యేక లైన్లు,,ఎక్స్ప్రెస్వే వెంట అక్కడక్కడ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు..120 కిలీమీటర్ల వేగ పరిమితికి అనుమతి ఉంటుంది..దేశంలో వాహనాలు అత్యంత వేగంగా ప్రయాణించే రోడ్డు ప్రస్తుతానికి ఇదే..ఎక్స్ప్రెస్వే మీద హెలిపాడ్లు,, ట్రౌమా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

7 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

12 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.