DISTRICTS

భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి-కమిషనర్ శ్రీమతి హరిత

విపత్తు నిర్వహణకు టోల్ ఫ్రీ నెంబర్లు..

నెల్లూరు: నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు నగర పాలక సంస్థ సిద్ధంగా ఉందని కమిషనర్ శ్రీమతి హరిత తెలిపారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రధాన డ్రైను మార్గాలు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలు, అండర్ బ్రిడ్జ్ ల పరిస్థితిని అధికారులతో కలిసి కమిషనర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాల నేపధ్యంలో కార్పొరేషన్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాల మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. వర్షాల నేపధ్యంలో సమస్యలు కలిగినవారు 18004251113, 0861 230 1541 నెంబర్లకు సమాచారం అందించి తగిన సహాయం పొందాలని కమిషనర్ తెలిపారు. రహదారులు, రోడ్లు, అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు మోటార్ల ద్వారా తోడివేస్తున్నామని,పాదచారులు, వాహన చోదకులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన ప్రాంతాలలో అధికారులు పర్యవేక్షిస్తున్నారని కమిషనర్ వెల్లడించారు.వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ప్రజలు భారీ వృక్షాల సమీపంలో నిలవడం, విద్యుత్ స్థంబాలను తాకడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వరద నీరు పెరుగుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కార్పొరేషన్ సూచించిన టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

17 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

21 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

21 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

21 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.