AMARAVATHI

పారిశుద్ద్యం నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన-కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నగర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి స్వచ్ఛ నెల్లూరు సాకారానికి కృషి చేయాలని అధికారులు, సచివాలయ కార్యదర్శులను నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశించారు.స్థానిక 42, 48 డివిజనుల సచివాలయాలలో శానిటేషన్ సిబ్బంది హాజరు రికార్డులను కమిషనర్ పరిశీలించారు. సెలవులలో ఉన్న సిబ్బంది నుండి విధులకు హాజరుకాని కారణంపై వివరణ తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక బోడిగాడి తోట డంపింగ్ యార్డులో చెత్త సేకరణ, తరలింపు వాహనాలకు సంభందించిన రికార్డులను పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో వాహనాల ద్వారా డోర్ టు డోర్ తడి, పొడి చెత్త సేకరణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ గురువారం పర్యవేక్షించారు. స్థానికంగా ఉన్న వివిధ వీధుల్లో డ్రైను కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని, దోమల నిర్మూలనకు మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణా చర్యల్లో భాగంగా అన్ని డ్రైను కాలువల్లో ఆయిల్ బాల్స్ పిచికారీ చేయాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్ పనులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. నగర పాలక సంస్థ అందజేసిన చెత్త బుట్టలలో తడి, పొడి చెత్తను విడిగా తీసి ఉంచాలని, రీ సైక్లింగ్ విధానానికి ప్రజలంతా బాధ్యతగా సహకరించాలని కమిషనర్ కోరారు. అనంతరం పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వెహికల్ షెడ్డును కమిషనర్ సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువల్లో పూడికతీత, సిల్ట్ తొలగింపు పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ శానిటేషన్ విభాగ అధికారులు, సచివాలయ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

13 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

15 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

19 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

19 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.