నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులు వేగవంతం అయ్యేలా పర్యవేక్షించి అతిత్వరలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత పేర్కొన్నారు. స్థానిక 20వ డివిజను వనంతోపు ప్రాంతంలోని వికలాంగుల భవన్ ప్రాంగణం, 22వ డివిజను బి.వి నగర్ లోని గిరిజన భవన్ ప్రాంగణం, 29వ డివిజను గాంధీ నగర్ లోని మహిళా ప్రాంగణంలో నిర్మిస్తున్నఆరోగ్య కేంద్రాలను కమిషనర్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో సూచించిన గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక గొలగముడి రోడ్డు ఇస్కాన్ టెంపుల్ మార్గంలోని మిట్ట కాలువపై జరుగుతున్న సిమెంట్ కల్వర్ట్ పనులను కమిషనర్ తనిఖీ చేసారు. కల్వర్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి రోడ్డు మార్గం ద్వారా రవాణా సాఫీగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.