AMARAVATHIDISTRICTS

చిల్డ్రన్స్ పార్కు ఆధునీకరణ పనులు వేగవంతం చేయండి-కమిషనర్ వికాస్

నెల్లూరు: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల పార్కులో జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి స్థానిక చిల్డ్రన్స్ పార్కులో జరుగుతున్న పనులను కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని చిన్న పిల్లల ఆటవిడుపు వస్తువులు, వివిధ రకాల ప్లే గ్రౌండ్స్, పచ్చదనాన్ని పెంపొందించే మొక్కలు, వాకింగ్ ట్రాక్, వ్యాయమ ఉపకరణాలు, స్విమ్మింగ్ పూల్, మంచి నీటి సౌకర్యాలు, బెంచ్ ల ఏర్పాటు, విద్యుత్ దీపాలు, సెక్యూరిటీ విభాగం, తినుబండారాల షాపులు తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. పార్కులోని సందర్శకులతో కమిషనర్ ప్రత్యక్షంగా మాట్లాడి అవసరమైన సదుపాయాల గురించి విచారించారు. ప్రజలు పార్కును ప్రతిరోజూ సందర్శించి ఆటవిడుపు పొందేలా అన్ని వసతులను కల్పించనున్నామని, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి పార్కును త్వరలో సందర్శకులకు అందుబాటులో తెనున్నామని కమిషనర్ వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *