చిత్తూరు: ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా ప్రకారం ఓట్ల లెక్కింపులో కంచర్ల శ్రీకాంత్ కు ఎన్నికల కమిషన్ ప్రకటనతో డిక్లరేషన్ అందించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్, చిత్తూరు యం.హరి నారాయణన్ తెలిపారు..శనివారం ఉదయం స్థానిక ఆర్ వి యస్ ఇంజనీరింగ్ కళాశాలో 16 నుంచి నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో,కంచర్ల శ్రీకాంత్ డిక్లరేషన్ అందుకున్నారు.ఈ నెల 16న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 18 న ఉదయం 2 గం.ల వరకు కొన సాగిన ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్నాటి పై 34,110 ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్ గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ ను అందుకున్నారు.. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యతా ప్రక్రియ విధానంతో మొత్తం 2,48,360 ఓట్లకు గానూ కంచర్ల శ్రీకాంత్ కు 1,24,181 ఓట్లు, శ్యామ్ ప్రసాద్ పెర్నాటి కి 90,071 ఓట్లు రావడం జరిగింద ని తెలిపారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ డిక్లరేషన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.