అమరావతి: దేశంలో ఎన్నికలు వస్తున్నాయి అంటే రాజకీయ పార్టీలు తమ స్వంత నిధులతో ఓటర్లకు పథకాలు అమలు చేస్తున్నట్లు భ్రమింప చేస్తూ అనేక ఉచిత వరాలు ప్రకటిస్తున్నాయి..ఓటర్లకు వరాలు ప్రకటించడంపై గతంలోనే సుప్రీం కోర్టు ఎన్నికల కమీషన్ వివరణ కోరింది..ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది..అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు పన్ను చెల్లింపుదారుల సొమ్ములతో ఉచితాలను పంచిపెడుతున్నరంటూ భట్టూలాల్ జైన్ అనే వ్యక్తి ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైన చేశారు..ఈ వ్యాజ్యంపై సమాధానం కోరుతూ కేంద్రం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతో పాటు భారత ఎన్నికల సంఘం,, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా కూడిన ధర్మాసనం నోటీసులు పంపింది.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పన్ను చెల్లింపుదారుల సొమ్ములను దుర్వినియోగం చేస్తున్నాయంటూ పిటీషనర్ ఆరోపించారు.. ”ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితం పేరుతో డబ్బులు పంచడం కంటే ఆరాచకం మరొకటి లేదు,, ఇది ప్రతిసారి జరుగుతోంది..అంతిమంగా పన్నుచెల్లింపుదారులపై ఆ భారం పడుతోంది” అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపించారు.. దీంతో ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీని ఆదేశించింది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.