AMARAVATHINATIONAL

ఓటర్లకు ఉచిత వారాలు ప్రకటించడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీం

అమరావతి: దేశంలో ఎన్నికలు వస్తున్నాయి అంటే రాజకీయ పార్టీలు తమ స్వంత నిధులతో ఓటర్లకు పథకాలు అమలు చేస్తున్నట్లు భ్రమింప చేస్తూ అనేక ఉచిత వరాలు ప్రకటిస్తున్నాయి..ఓటర్లకు వరాలు ప్రకటించడంపై గతంలోనే సుప్రీం కోర్టు ఎన్నికల కమీషన్ వివరణ కోరింది..ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది..అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు పన్ను చెల్లింపుదారుల సొమ్ములతో ఉచితాలను పంచిపెడుతున్నరంటూ భట్టూలాల్ జైన్ అనే వ్యక్తి ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైన చేశారు..ఈ వ్యాజ్యంపై సమాధానం కోరుతూ కేంద్రం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతో పాటు భారత ఎన్నికల సంఘం,, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా కూడిన ధర్మాసనం నోటీసులు పంపింది.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పన్ను చెల్లింపుదారుల సొమ్ములను దుర్వినియోగం చేస్తున్నాయంటూ పిటీషనర్ ఆరోపించారు.. ”ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితం పేరుతో డబ్బులు పంచడం కంటే ఆరాచకం మరొకటి లేదు,, ఇది ప్రతిసారి జరుగుతోంది..అంతిమంగా పన్నుచెల్లింపుదారులపై ఆ భారం పడుతోంది” అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపించారు.. దీంతో ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీని ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *