నెల్లూరు: ఓటర్ల జాబితా నుండి ఓటు తొలగించిన విషయమై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పలు మండలాల్లో జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ హరినారాయణన్ శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం చెర్లోపల్లి, గోవిందరాజపురం, జట్ల కొండూరు, కొండూరు సత్రం, వెంకటాచలం మండలం ఇస్కపాలెం తదితర గ్రామాల్లో చనిపోయిన, రెండు ఓట్లు ఉన్న వారి ఓటు తొలగింపు, వేరే చోటుకు బదిలీ అయిన ఓటు తొలగించడం పై వాస్తవ పరిస్థితిని వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు. చనిపోయారా , ఇక్కడ లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారాయని కుటుంబ సభ్యులను, పరిసర ప్రాంతాల వారిని ఆరాతీశారు. ఓటు తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు తెలియచేశారా లేదా అని విచారించారు. మాకు తెలియ చేసే మరణించిన వారి ఓటు తొలగించారని కుటుంబ సభ్యులు కలెక్టర్ కు తెలిపారు. ఓటరు జాబితా నుంచి ఓటు తొలగించు విషయమై ర్యాoడం తనిఖీలలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారు పల్లి, జ్యోతినగర్, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.కలెక్టర్ వెంట మనుబోలు, వెంకటాచలం, నెల్లూరు రూరల్ తహసీల్దార్లు శివకృష్ణయ్య, వెంకటేశ్వర్లు, గోపికృష్ణ, బి ఎల్ ఓ లు ,తదితరులు ఉన్నారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.