AMARAVATHIDISTRICTS

ఓటర్ల తొలగింపును స్వయంగా పరిశీలించిన కలెక్టర్

నెల్లూరు: ఓటర్ల జాబితా నుండి ఓటు తొలగించిన విషయమై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పలు మండలాల్లో జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ హరినారాయణన్ శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం చెర్లోపల్లి, గోవిందరాజపురం, జట్ల కొండూరు, కొండూరు సత్రం, వెంకటాచలం మండలం ఇస్కపాలెం తదితర గ్రామాల్లో చనిపోయిన, రెండు ఓట్లు ఉన్న వారి  ఓటు తొలగింపు, వేరే చోటుకు బదిలీ అయిన  ఓటు తొలగించడం పై వాస్తవ పరిస్థితిని వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు. చనిపోయారా , ఇక్కడ లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారాయని కుటుంబ సభ్యులను, పరిసర ప్రాంతాల వారిని ఆరాతీశారు. ఓటు తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు తెలియచేశారా లేదా అని  విచారించారు. మాకు తెలియ చేసే మరణించిన వారి ఓటు తొలగించారని కుటుంబ సభ్యులు కలెక్టర్ కు తెలిపారు. ఓటరు జాబితా నుంచి ఓటు తొలగించు విషయమై ర్యాoడం తనిఖీలలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారు పల్లి, జ్యోతినగర్, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.కలెక్టర్ వెంట మనుబోలు, వెంకటాచలం, నెల్లూరు రూరల్ తహసీల్దార్లు శివకృష్ణయ్య, వెంకటేశ్వర్లు, గోపికృష్ణ, బి ఎల్ ఓ లు ,తదితరులు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *