AMARAVATHI

ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది-అంబటి

నెల్లూరు: అన్ని వర్గాలతో పాటు కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని,సీ.ఎం  జగన్మోహన్ రెడ్డి కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో రూ. 6.15 కోట్లతో నూతనంగా నిర్మించిన కాపు భవన్ ను మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన కాపు భవనానికి తమ ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రారంభించడం తమ  అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గమని, దక్షిణ భారతదేశంలో కాపు సామాజిక వర్గం బాగా విస్తరించిందని, ఈ సామాజిక వర్గం సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎం.పీ ఆదాల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నారాయణ ఈ భవన నిర్మాణానికి రూ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని, వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ భవనం అందరికీ ఉపయోగపడేలా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.ఈకార్యక్రమంలో కాపు కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

4 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

6 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

10 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

10 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

14 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.