AMARAVATHIDISTRICTS

ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది-అంబటి

నెల్లూరు: అన్ని వర్గాలతో పాటు కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని,సీ.ఎం  జగన్మోహన్ రెడ్డి కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో రూ. 6.15 కోట్లతో నూతనంగా నిర్మించిన కాపు భవన్ ను మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన కాపు భవనానికి తమ ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రారంభించడం తమ  అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గమని, దక్షిణ భారతదేశంలో కాపు సామాజిక వర్గం బాగా విస్తరించిందని, ఈ సామాజిక వర్గం సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎం.పీ ఆదాల మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నారాయణ ఈ భవన నిర్మాణానికి రూ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని, వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ భవనం అందరికీ ఉపయోగపడేలా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు.ఈకార్యక్రమంలో కాపు కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *