AMARAVATHI

రూ.999కే జియోభారత్ 4జి స్మార్ట్ ఫోన్, జూలై 7నుంచి మార్కెట్ లో లభ్యం

అమరావతి: దేశీయ మొబైల్ రంగంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది..జియోభారత్ 2జి నుంచి 4జికి ప్రమోట్ చేసే నేపధ్యంలో జియో భారత్4జి పేరుతో ఫోన్ లాంచ్ చేసింది.. రూ.999లకే కార్బన్ కంపెనీ భాగస్వామ్యంలో ఈ ఫోన్ అందుబాటులో తెచ్చారు..జూలై 7వ తేది నుంచి 10 లక్షల జియో భారత్ 4జి ఫోన్లు మార్కెట్లోకి విక్రయించనుంది..28 రోజుల వ్యాలిడిటీతో 14 జీబీ డేటా (రోజుకు 0.5జీబీ) అందిస్తున్నారు.. సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.. రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది..దేశంలో ఇప్పటివరకు 25 కోట్లమంది జియో మొబైల్స్ వాడుతున్నారని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు.. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందన్నారు.. దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని జియో వర్గాలు తెలిపాయి.. స్క్రీన్ కింద కీప్యాడ్, జియో భారత్ బ్రాండ్ తో ఇతర ఫీచర్ ఫోన్ మాదిరిగానే కనిపిస్తున్నప్పటికి ఇది 4జి స్మార్ట్ ఫోన్.. దీనిలో వెనకభాగాన కెమెరా, స్పీకర్లు ఉంటాయి..ఇండియాలో ఎక్కడికైనా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.. అలాగే యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది..

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

8 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

13 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

1 day ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

1 day ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.