AMARAVATHI

దేశంలో 10 కోట్ల గీతను దాటిపోయిన మధుమేహం బాధితులు సంఖ్య

అమరావతి: దేశంలో మధుమేహం బాధితులు పెరిగిపోవడంపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ చేసిన అధ్యయనం యూకేకు చెందిన మెడికల్ జర్నల్ లాన్ సెట్ లో ప్రచురితమైంది..ఈ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల గీతను దాటిపోయింది..2019లో 7 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య నాలుగు సంవత్సరాల వ్యవధిలో 44 శాతం పెరిగింది..ప్రస్తుతం దేశంలో ప్రీడయాబెటిక్స్ (త్వరలో మధుమేహం బారినపడే అవకాశం ఉన్నవాళ్లు) సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది..దేశవ్యాప్తంగా 13.60 కోట్ల మందిలో ప్రీడయాబెటిక్ లక్షణాలు బయటపడ్డాయి..ఈ లెక్కన తీసుకుంటే దేశం మొత్తం జనాభాలో ప్రీడయాబెటిక్స్ సంఖ్య 15.3 శాతంగా ఉన్నది..శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు,,కేంద్రపాలిత,,పట్టణ,, గ్రామీణ ప్రాంతాల్లో నివాసిస్తున్న దాదాపు లక్ష మందిపై 2008 అక్టోబర్ 18 నుంచి 2019 డిసెంబర్ 17 వరకు ఈ అధ్యయనం చేశారు..ఈ అధ్యయనం ప్రకారం 2019 డిసెంబర్ నాటికి దేశంలో మధుమేహుల సంఖ్య 7.20 కోట్లుగా ఉండగా ఆటు తరువాత నాలుగు సంవత్సరాల్లో ఈ సంఖ్య 10.10 కోట్లకు పెరిగింది..అలాగే దేశ జనాభాలో 35.5 శాతం మంది అధిక రక్తపోటుతో,, 81.2 శాతం మంది అసాధారణ కొవ్వులతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టం అయింది..అదేవిధంగా 28.6 శాతం మంది సాధారణ ఊబకాయం,, 39.5 శాతం మంది పొట్ట సంబంధ ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

19 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

19 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

24 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.