DISTRICTS

ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో కొత్తగా మంజూరై చేపడుతున్న జాతీయ రహదారులకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు, రైల్వే, పరిశ్రమల ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో భూసేకరణ, అలీనేషన్ తదితర అంశాలపై సమావేశం నిర్వహించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూములను సేకరించడంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబందించి ప్రాజెక్టు వారీగా నిర్ధిష్టమైన గడువును నిర్దారించుకొని ఆ గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలన్నారు. వివిధ ప్రాజెక్ట్స్ భూసేకరణకు సంబందించి పెండింగ్లో వున్న అనేగ్జర్-XI లను త్వరగా మంజూరు అయ్యేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. జిల్లాకు మంజూరైన  వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూములు సేకరించడంతో పాటు అలీనేషన్, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడంలో చాలా ఆలస్యం అవుతోoదని,  రెవెన్యూ డివిజనల్ అధికారులు ఇకనైనా ఎటువంటి జాప్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రక్రియను  త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు.నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎపిఐఐసి, ఇరిగేషన్  తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో సంబందిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

18 hours ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

19 hours ago

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఈడీ దాడుల్లో బయటపడిన రూ.25 కోట్ల నగదు

అమరావతి: జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…

19 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను సజావుగా ఉపయోగించుకుంటున్న ఉద్యోగులు-కలెక్టర్

అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…

20 hours ago

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 days ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 days ago

This website uses cookies.