AMARAVATHI

జగన్ సీ.ఎం అన్న కారణంతో ట్రయల్ ఆలస్యం కాకూడదు-సుప్రీంకోర్టు

అమరావతి: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది..ఈ క్రమంలో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించింది..4 వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆగస్ట్ 5వ తేదికి తదుపరి విచారణను వాయిదా వేసింది.. డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని CBI తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు.. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.. ట్రయల్‌ సవ్యంగానే జరుగుతోందని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదు అఫిడవిట్‌ ఎందుకు ఫైల్‌ చేయలేదో చెప్పాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు..
ముఖ్యమంత్రి అన్న కారణంగానే ట్రయల్‌ ఆలస్యం అవుతోందనేది ప్రధాన ఆరోపణ దానికి ఏం సమాధానం చెపుతారని కోర్టు నిలిదీసింది.. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.. ట్రయల్‌ సుధీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది.. ఇలాంటి విషయాల్లో విచారణ జరుపుతున్న కోర్టులే నిర్ణయం తీసుకోవాలని,, ట్రయల్‌ వేగంగా జరపాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.. బెయిల్‌ రద్దు,, హైదరాబాద్‌ నుంచి ట్రయల్‌ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడుతామని సుప్రీం ధర్మసనం తెలిపింది..

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

23 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

23 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

1 day ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

1 day ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

2 days ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

2 days ago

This website uses cookies.