AMARAVATHINATIONAL

జగన్ సీ.ఎం అన్న కారణంతో ట్రయల్ ఆలస్యం కాకూడదు-సుప్రీంకోర్టు

అమరావతి: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది..ఈ క్రమంలో ట్రయల్‌ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించింది..4 వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆగస్ట్ 5వ తేదికి తదుపరి విచారణను వాయిదా వేసింది.. డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని CBI తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు.. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.. ట్రయల్‌ సవ్యంగానే జరుగుతోందని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదు అఫిడవిట్‌ ఎందుకు ఫైల్‌ చేయలేదో చెప్పాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రశ్నించారు..
ముఖ్యమంత్రి అన్న కారణంగానే ట్రయల్‌ ఆలస్యం అవుతోందనేది ప్రధాన ఆరోపణ దానికి ఏం సమాధానం చెపుతారని కోర్టు నిలిదీసింది.. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది.. ట్రయల్‌ సుధీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది.. ఇలాంటి విషయాల్లో విచారణ జరుపుతున్న కోర్టులే నిర్ణయం తీసుకోవాలని,, ట్రయల్‌ వేగంగా జరపాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.. బెయిల్‌ రద్దు,, హైదరాబాద్‌ నుంచి ట్రయల్‌ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడుతామని సుప్రీం ధర్మసనం తెలిపింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *