నెల్లూరు: జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను, ప్రజలను ఉదారంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని జాతీయ ప్రకృతి విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ పేర్కొన్నారు. జిల్లాలో తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం విచ్చేసిన కేంద్ర బృంద సభ్యులు రాజేంద్ర రత్నూ, విక్రంసింగ్ కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించి జరిగిన నష్టాన్ని కేంద్ర బృంద సభ్యులకు క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర రత్నూ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించామని, అధికారులు తాత్కాలికంగా చూపిన నష్టం వివరాలను పరిశీలించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 9 జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయని, తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. తుఫాన్ ప్రభావంతో వ్యవసాయ,ఉద్యానవన పంటలు, మత్స్య, పాడి పరిశ్రమ, విద్యుత్, హౌసింగ్ శాఖలకు నష్టం వాటిల్లిందని, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.