బీజెపీకీ పెరుగుతున్న మద్దతు…
అమరావతి: మే 10వ తేదిన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 16 హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత యడ్యూరప్ప సమక్షమంలో విడుదల చేశారు..మ్యానిఫెస్టోకు ‘ప్రజాధ్వని’ అని బీజేపీ పేరు పెట్టింది..అధికారంలోకి వస్తే బెంగళూరు అపార్టుమెంటుల్లో నివసిస్తున్న వారి సమస్యలు చక్కదిద్దుతామని మానిఫెస్టోలో కన్నడ ప్రజలకు హామీ ఇచ్చింది..దారిద్ర్యరేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ఉగాది, గణేశ చతుర్ధి, దీపావళి పండుగ నెలల్లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది..సరసమైన ధరకు ఆహారాన్ని అందించేందుకు ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాన్ని కూడా ఏర్పాడు చేస్తామని తెలిపింది..వీటితో పాటు ప్రతినెలా ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం, 5 కిలోల ఉచిత గోధుమలు అందిస్తామని ప్రకటించింది..రాష్ట్రంలోని ప్రతి తాలూకాలో కీమోథెరపీ, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది..యూనిఫాం సివిల్ కోడ్, మత ఛాందసవాదాన్ని నియంత్రించేందుకు ఓ విభాగం, NRC అమలు చేయడం వంటి అంశాలను ఈ మానిఫెస్టోలో పొందుపరిచింది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.