AMARAVATHI

ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి,మహిళకు తీవ్ర గాయాలు

తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండలంలోని బైపాస్ రోడ్డులో కారు, స్కూల్ బస్సు ఢీకొనడంతో, కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాల అయ్యాయి..శుక్రవారం పుత్తూరు పరిధిలోని పరమేశ్వర మండలం గ్రామానికి చెందిన రమేష్(60), పుష్ప(55), భాను(42), వనజాక్షమ్మ(60), శివమ్మ(55) లు కారులో తమిళనాడులోని పెరంబురులో నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తున్నారు..నారాయణవనం బైపాస్ వద్ద కారు ముందుకు వెళ్లుతున్న మరో వాహనంను ఓవర్ టెక్ చేస్తూ ఎదురుగా శ్రీ వెంకటేశ పెరుమాళ్ కళాశాలకు చెందిన బస్సును ఢీకొంది.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రమేష్, పుష్ప, భాను, వనజాక్షమ్మ సంఘటన స్థలంలోనే మృతి చెందారు..మరో మహిళ శివమ్మకు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా కు తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

15 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

15 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

20 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.