AMARAVATHI

పాకిస్తాన్ నుంచి వచ్చే రవాణ ట్రక్కులను నిలిపివేసిన ఆఫ్గనిస్థాన్

అమరావతి: పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ ల మధ్య సంబంధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి..గత మూడు రోజుల నుంచి పాకిస్థాన్ నుంచి వస్తున్న వేలాది ట్రక్కులు ఆఫ్గనిస్థాన్ లో ప్రవేశించకుండా టోర్కామ్ సరిహద్దు వద్ద నిలిపివేసింది..ఆఫ్గనిస్థాన్ పౌరులను పాకిస్తాన్ బహిష్కరించిన నేపధ్యంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది.. ఆఫ్గనిస్థాన్ అవలంభించిన ఈ కఠిన వైఖరితో పాకిస్థాన్ కు దిమ్మతిరిగింది..
ఈ బహిరంగ సరిహద్దు ద్వారానే పాకిస్థాన్,, భారత్ లోకి పెద్దఎత్తున డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేసేదని మన విదేశీ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు..పాకిస్థాన్ నుంచి ఆఫ్గనిస్థాన్ కు పంపిన ట్రక్కుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తిరిగి పాకిస్థాన్ కు చేరుకుంటాయని విదేశీ వ్యవహారాల వెల్లడిస్తున్నారు.. ఆఫ్గనిస్థాన్,వాణ్యిజ,వ్యాపార సంబంధలు దాదాపు తెగిపోవడంతో రాబోయే రోజుల్లో పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ వ్యాపారం అరికట్టవచ్చని అంచనా వేస్తున్నారు..
పాకిస్థాన్ తన దేశం నుంచి అక్కడ నివసిస్తున్న ఆఫ్గన్ శరణార్థులను బలవంతంగా బహిష్కరించడం ప్రారంభించింది..ఒక లెక్క ప్రకారం, ఇప్పటివరకు 3,5 లక్షల మందికి పైగా పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు పంపించి వేశారు..వీరిలో వేలాది మంది గనిస్థాన్ నుంచి చట్టబద్ధంగా పాకిస్థాన్ వెళ్లడమే కాకుండా శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారని పాకిస్థాన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్గనిస్థాన్ లోపల పరిస్థితిని మరింత దిగజారిన సందర్భంలో పాకిస్థాన్ కుట్రలు ప్రారంభించింది.
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు ప్రస్తుతం ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయి.. గత కొన్ని రోజుల నుంచి ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చే వారిపై పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది..చట్టబద్ధమైన వీసా, పాస్ పోర్ట్ హోల్డర్లు మాత్రమే వచ్చేలా,, మిగతా వారిని ప్రవేశించకుండా నిషేధించడం ప్రారంభించిన తరువాత ఈ పరిస్థితి ఏర్పడింది..ఈ విషయపై పాకిస్థాన్ కు ఆఫ్గనిస్తాన్ నిరసన వ్యక్తం చేసింది..అయితే ఇందుకు పాకిస్తాన్,, వాణిజ్యాన్ని మూసివేస్తామని ఆఫ్గనిస్తాన్ ను బెదిరించడం ప్రారంభించింది..ఇందుకు ప్రతీకారంగా మంగళవారం సాయంత్రం నుంచి వేలాది పాకిస్థానీ ట్రక్కులను దేశంలోకి రాకుండా ఆఫ్గన్ ఆపడమే కాకుండా, పాక్ లో ఉన్న తమ ట్రక్కులన్నింటినీ వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది..రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సందే..

 

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

16 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

17 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

18 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

20 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

21 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.